YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

28 ఎన్నికలపై బీజేపీ దృష్టి

28 ఎన్నికలపై బీజేపీ దృష్టి

కర్ణాటకలో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే బీజేపీ సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగానే సంపూర్ణ మెజారిటీ  సాధించిన బీజేపీ ప్రస్తుతం ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు నాలుగు లోక్‌సభ స్థానాలకు ఈ నెల 28న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నాలుగింటిలోనూ బీజేపీ గట్టి పోటీనెదుర్కొంటున్నది.ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ మూడింటిలో గెలుపొందినప్పటికీ ఐదు స్థానాల్లో ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ తన స్థానాలను నిలబెట్టుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు బీజేపీకి పార్లమెంట్‌లో బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే భాగస్వామ్య పక్షాల మద్దతు లేకపోయినా ప్రభుత్వం గట్టెక్కగలదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో 538 మంది సభ్యులే  ఉన్న నేపథ్యంలో బల నిరూపణకు 269 మంది అవసరమని, ఆ సంఖ్య బీజేపీకి ఉన్నదని వారు వివరిస్తున్నారు. ఒకవేళ ఈ నెల 28న జరుగనున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే మాత్రం కష్టాలు తప్పకపోవచ్చునని అంటున్నారు.కర్ణాటకకు చెందిన ఆ పార్టీ సభ్యులు యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఇటీవల లోక్‌సభకు రాజీనామా చేయడంతో బీజేపీ బలం 271కి తగ్గిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు సీట్లను బీజేపీ కోల్పోగా, ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు మరణించడంతో ఆ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీంతో 543 మంది సభ్యులున్న లోక్‌సభలో కనీస మెజారిటీ అయిన 272 సీట్లకు బీజేపీ ఒక స్థానం దూరంలో ఉంది.యడ్యూరప్ప, శ్రీరాములు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో ఈ నెల 19న బలనిరూపణకు కొన్ని గంటల ముందు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించినట్టు లోక్‌సభ వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి 271 మంది సభ్యులుండగా, వారిలో బీహార్‌కు చెందిన ఒక ఎంపీ కీర్తీ ఆజాద్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ రాష్ర్టానికే చెందిన మరో ఎంపీ శత్రుఘన్ సిన్హా నిత్యం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. యూపీకి చెందిన మహిళా ఎంపీ సావిత్రీ బాయి సైతం దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.లోక్‌సభలో బీజేపీ ఎంపీల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నది. అయిత ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ మునుపటిలా హుకుం చెలాయించే పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. ఇక 18 మంది ఎంపీలున్న శివసేనతో మోదీ సర్కార్ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా విడిగా పోటీ చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో బీజేపీ మిత్రపక్షమైన పీడీపీ తమ శ్రీనగర్ లోక్‌సభ స్థానాన్ని ఇటీవలి ఉప ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు కోల్పోయింది. 

Related Posts