భద్రాద్రి కొత్తగూడెం
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గం స్థానిక శాసనసభ్యుడు రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేసారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు సిగ్గుచేటు. నికృష్ట రాజకీయాలకు కేరాఫ్ బిజెపి. ఏ పేపర్ లీకేజ్ అయినా దాని వెనుక బండి సంజయ్ హస్తం వుంటుంది. ఎవరిని వదిలేది లేదని అన్నారు.
యువత అప్రమత్తంగా ఉండాలి. బిజెపి కుట్రలు చేస్తుంది. విద్యార్థులు ధైర్యంగా ఉండండి. పేపర్ లీకేజీ పాపం బండి సంజయ్ దే. ఉత్తరాదిన చేసినట్లు చేస్తే ఇక్కడ నడవదని హెచ్చరించారు.
జిల్లావ్యాప్తంగా బిఆర్ఎస్ యువ సైన్యం బిజెపి దిష్టిబొమ్మలు తగలబెట్టండి నిరసన ర్యాలీలు చేయండని అంటూ ఫేస్బుక్ లో ఘాటైన వ్యాఖ్యలను పోస్ట్ చేసి, వాటిని వాట్సాప్ గ్రూపుల ద్వారా సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నారు..