హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై కొనసాగుతున్న ఈడి దర్యాప్తు ముమ్మరం అయింది. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు శంకర్ లక్ష్మి ,సత్యనారాయణను ఈడి ప్రశ్నించనున్ఆరు. సిట్ కేసులో కీలక సాక్షిగా టిఎస్పిసి ఉద్యోగి, శంకర్ లక్ష్మి వున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ ఈడి పిటీషన్ కోర్టులో దాఖలు చేసింది. విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాశారని అభియోగాల పై ఈడి విచారణచేస్తోంది. హవాలా రూపంలో నగదు చేతులు మారినట్లు గుర్తించారు. కేసు వివరాల కోసం ఇప్పటికే అధికారులకు ఈడీ లేఖ రాసింది.