హైదరాబాద్
తెలంగాణ హైకోర్టు లో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతు పై విచారణ జరగింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను హైకోర్టు ఆదేశించింది. తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో తెలపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 18కి వాయిదా వేసింది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి లక్షన్ కుమార్ పై 441 ఓట్ల తేడాతో మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు.దాంతో లక్షన్ కుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు.