YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. 
ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటుపరం చేయాలని అనుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.  
ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టాం. ఆర్ఎఎన్ఎల్ అధికారులతో భేటీ అవుతున్నామని అన్నారు.   తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్లో పాల్గొనడం వారి పరిధిలోని విషయం అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Related Posts