YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

విజయసాయి రెడ్డి , రమణ దీక్షితులపై నిప్పులు చెరిగిన హోం మంత్రి చినరాజప్ప

విజయసాయి రెడ్డి , రమణ దీక్షితులపై నిప్పులు చెరిగిన హోం మంత్రి చినరాజప్ప

వైకాపా నేత జగన్ తాను పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతూ విజయసాయిరెడ్డిని తన మౌత్ పీస్ గా వాడుకుంటున్నాడు . విజయసాయిరెడ్డి ఒక ఆర్దిక నేరస్తుడని ప్రజలు గుర్తించాలి. అటు డిల్లీలో బిజేపి పార్టీ తో లాభీయింగ్ చేస్తూ , ఇటు టీడిపి పై దుమ్మెత్తి పోస్తున్నాడని హోం మత్రి, ఉప ముఖ్యమత్రి చినరాజప్ప అన్నారు. గురువారం నాడు అయన చిత్తురు లో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ ను  ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ని ఉపయోగించి నేరాలను నియంత్రించే సదుపాయాలు వచ్చాయని , ఇటువంటి పోలీస్ స్టేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అమర్నాధ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎంపీ శివ ప్రసాద్, ఎమ్మెల్యే సత్యప్రభ, కలెక్టర్ ప్రద్యుమ్న పాల్గొన్నారు. చిన రాజప్ప మాట్లాడుతూ  పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచనతో టెక్నాలజీ ని ఉపయోగించి చిత్తూరులో మోడల్ పోలీస్ స్టేషన్ ను నిర్మించమని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు.సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వరున్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ది వెతుక్కుంటున్నారు. వారి ఆరోపణలకు తీవ్రత కోసమే తిరుమల వివాదాన్ని సృస్టిస్తున్నారు. అందులో రమణదీక్షితులును పావుగా వాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఏంటో బాగా తెలుసు . వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో బాగా తెలుసని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడింది నాడు ఎన్ టీ ఆర్ , నేడు చంద్రబాబు. పవన్ కళ్యాన్ పూటకో మాట మాట్లాడుతున్నాడు . ఇలా కొనసాగితే ప్రజలలో మరింత చులకన అవుతాడని అన్నారు. జే డి యస్ తో ఉన్న అనుభందంతోనే కర్ణాటక లో జరిగిన  ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరయ్యారు . కాంగ్రెస్ తో దోస్తీకి టీడిపీ సిద్దంగా లేదు . టీడిపి మూడవ ప్రత్యామ్నాయానికే మొగ్గు చూపుతుందని అయన అన్నారు. 

Related Posts