YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ కుట్రలు పన్నుతోంది చలసాని శ్రీనివాస్

విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వ కుట్రలు పన్నుతోంది చలసాని శ్రీనివాస్

విశాఖపట్నం
విశాఖ ఉక్కును తుక్కు తుక్కు చేయాలని కేంద్రం ఆలోచన అని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించిన పరిశ్రమ ఇది అని.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు.విజయ్ సాయి రెడ్డి ఏమైయ్యా రు? స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఎందు కు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మెడలు వంచుతామన్న జగన్ ఎందు కు కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని నిలదీ శారు. రాష్ట్రం ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించాలన్నారు. 35 ఎంపీలు ఉన్నా.. పార్లమెంట్లో ప్రస్తా వించడం లేదని ఆయన మండిపడ్డా రు.రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజే పీకి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుగా మాట్లాడడం అంటే.. ఏపీకి అన్యాయం చేసినట్టే అని అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్ లో అన్యాయం జరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని చలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts