నవనిర్మాణ దీక్ష ఏర్పాట్లపై సియం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జూన్ 2 నుండి 8 వరకు జరిగే దీక్ష ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. జూన్ 8 నాటికి సియంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవ నిర్మాణ దీక్ష రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేసిన అన్యాయం పైనే ఫోకస్ పెట్టనుంది. ఈ సారి 13 జిల్లాలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జరిగే నవనిర్మాణ దీక్ష లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గోంటారు. అయితే, రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం సమంజసం కాదు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఏవిధంగా వేడుకలు జరపుకుంటామని అయన అన్నారు. నాలుగేళ్లు గడచినా రాష్ట్రానికి న్యాయం జరగలేదు కదా, ఏవిధంగా మేలు జరిగింది? తలసరి ఆదాయంలో మనం ఇంకా వెనకబడే ఉన్నామని చంద్రబాబు అన్నారు.