YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నేడు బద్వేలుకు చంద్రబాబు నాయుడు రాక

నేడు బద్వేలుకు చంద్రబాబు నాయుడు రాక

బద్వేలు
బద్వేల్ కు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం వస్తున్నారు చంద్రబాబు రాక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లని చక చక జరిగిపోతున్నాయి కడపలో మంగళవారం జరిగే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ సదస్సు ముగిసిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని చంద్రబాబు బద్వేలుకు వస్తున్నారు మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ స్వగృహంలో చంద్రబాబు బసచేస్తారు అనంతరం బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు చెందిన కళ్యాణ మండపంలో బద్వేలు మైదుకూరు నియోజకవర్గాల చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది దాదాపు రెండు గంటలపాటు జరిగే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అచ్చినాయుడు కడప జిల్లా నేతలు పాల్గొంటారు చంద్రబాబు నిర్వహించే ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వ్ అయిన తర్వాత ప్రతి ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు ఇప్పుడు పరిణామాలు మారడంతో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలు ధీమా గా ఉన్నారు అంతేకాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పార్టీ పటిష్టంగా ఉంది మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు రితేష్ కుమార్ రెడ్డి పార్టీ విజయం కోసం ఎన్నికల ముందు నుంచే కష్టపడుతున్నారు ఇది ఎవరు కూడా కాదని నిజం గతంలో కంటే ఇప్పుడు వారు ఎంత స్పీడ్ గా ఉన్నారు
ఇటీవల కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ రెండు సమావేశాల్లో చంద్రబాబు నాయుడు బద్వేలు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కార్యకర్తలు నాయకులు బాగా పని చేస్తున్నారని కితాబు  ఇచ్చారు ఎన్నికల సమయం మరి ఎంతో దూరంలో లేదని ఇప్పటినుంచి నాయకులు కార్యకర్తలు మరింతగా పనిచేయాలని వారికి చెప్పడం జరిగింది ఇది ఇలా ఉంటే బద్వేల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటివరకు స్పష్టంగా రావడం లేదు బద్వేల్ అసెంబ్లీ తర్వాత ప్రతి ఎన్నికల్లోను కొత్త ముఖాలే అభ్యర్థిగా ఉంటూ వచ్చారు తాజాగా జరిగిన 2019 ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్ ను అభ్యర్థిగా పోటీ చేశారు తాజాగా జరిగిన బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్ ను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు ఇప్పుడు డాక్టర్ రాజశేఖర్ను
తెలుగుదేశం దూరంగా పెట్టింది ఆయన కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు ఇప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త అభ్యర్థి కోసం  వేట ప్రారంభించినట్లు ప్రచారం
చాలా రోజులుగా జరుగుతుంది ఈ ప్రచారాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాదనలేక పోతున్నారు బద్వేలు మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ సమ్మెట అబ్రహం తోపాటు మరో నలుగురు వ్యక్తులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు వారి జాబితా కూడా నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్లు సమాచారం ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చెప్పినవారికి పార్టీ టికెట్ చంద్రబాబు కట్టబెడతారని సమాచారం గతంలో కూడా ఇలాగే జరిగింది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది కానీ ఆశావాహులు తమ ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేసినట్లు సమాచారం బుధవారం బద్వేల్ లో జరిగే సమావేశంలో చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ప్రకటిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ముందుగానే ప్రకటించి సంచలనం తెలిపారు బద్వేల్ లో కూడా ఇలాంటి సంచలనం రేపుతారా అని నాయకులు కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు

Related Posts