YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అమిత్ షా హైదరాబాద్ టూర్ ఖరారు

అమిత్ షా హైదరాబాద్ టూర్ ఖరారు

హైదరాబాద్
తెలంగాణలో బీజేపీ రాజకీయ కార్యకలాపాలను వ్యూహాత్మకంగా, వేగంగా అమలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలలో అసంతృప్తితో బయటకు వచ్చిన వారిని పార్టీలో చేర్పించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన ఖరారు అయింది. ఏప్రిల్ 23న ఆయన హైదరాబాద్ కు వచ్చేలా షెడ్యూల్ ఖరారు అయింది. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు చేస్తారని సమాచారం. అంతేకాకుండా ఈ వేదికపైనే భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని ప్రచారం నడుస్తోంది.

Related Posts