హైదరాబాద్
తెలంగాణలో బీజేపీ రాజకీయ కార్యకలాపాలను వ్యూహాత్మకంగా, వేగంగా అమలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో అసంతృప్తితో బయటకు వచ్చిన వారిని పార్టీలో చేర్పించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన ఖరారు అయింది. ఏప్రిల్ 23న ఆయన హైదరాబాద్ కు వచ్చేలా షెడ్యూల్ ఖరారు అయింది. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు చేస్తారని సమాచారం. అంతేకాకుండా ఈ వేదికపైనే భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని ప్రచారం నడుస్తోంది.