YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కాకిణి

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కాకిణి

కావలి
ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12వ తేదీ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.  ఈనేపధ్యంలో ఏర్పాట్లను వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో సమీక్షించి హెలిప్యాడ్ ప్రదేశాన్ని,సభ ప్రాంగణాన్ని చూసి పలు సూచనలు చేసారు. మంత్రితో పాటు స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, శాసనమండలి సభ్యులు ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాం, జిల్లా కలెక్టర్ హరి నారాయణ్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్, జిల్లాకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts