యాదాద్రి
సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుడు సోమేశ్ కుమార్ బుధవారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం అయనను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడుగా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత కొద్దిరోజులు క్రితం అయన సిఎస్ గా పదవి విరమణ చేసారు. సీఎం కెసిఆర్ గత సాంప్రదాయాల ప్రకారం ఉన్నతాధికారులు ఉద్యోగ విరమణ పొందిన వారిని తిరిగి ప్రధాన సలహాదారులుగా నియమిస్తూ వస్తున్నారు.