YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి- సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే !

తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి- సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే !

హైదరాబాద్
పదో తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫీజును ఈ నెల 26వ తేదీలోపు చెల్లించాలని ఆదేశించింది. పదోతరగతి ఫలితాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్‌ కోసం 500 రూపాయల ఫీజు చెల్లించి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్, డూప్లికేట్‌ క్వశ్చన్ పేపర్స్ కోసం ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చెల్లించాలి.  స్కూల్ హెడ్‌మాస్టర్‌తో సంతకం చేయించిన దరఖాస్తులో హాల్‌టికెట్లు జతపరిచి డీఈవో ఆఫీస్‌కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మాత్రమే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది. కొరియర్, పోస్టు చేసిన దరఖాస్తులు స్వీకరించేది లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. దరఖాస్తులను bse.telangana.gov.inలో ఉంచారు. 2022-23విద్యా సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ పదోతరగతి ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత 3.85 శాతం అధికంగా ఉంది. 2023లో పదోతరగతి పరీక్ష రాసేందుకు 4,94,504 మంది రిజిస్టర్ చేసుకుంటే.. అందులో 4,91,862 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 4,84,370 మంది రెగ్యులర్ విద్యార్థులైతే... 7,492 మంది ప్రైవేట్‌ విద్యార్థులు. 2022లో 5,04,398 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.
తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ బడులు 72.39 శాతంతో తక్కువ ఉత్తీర్ణతను నమోదు చేశాయి. కేజీబీవీ, ఎయిడెడ్‌, జడ్పీ, ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదు చేశాయి.
సబ్జెక్టలు వారీగా చూసుకుంటే...
ఫస్ట్ లాంగ్వేజ్‌ పరీక్షకు 475197 మంది ఉత్తీర్ణత పొందారు. వీళ్ల ఉత్తీర్ణత శాతం 98.17. సెకండ్ లాంగ్వేజ్‌లో 481885 మంది అంటే 99.7 శాతం మంది పాస్ అయ్యారు. తృతీయ భాషలో 475843 మంది పాస్ అయ్యారు. మ్యాథ్స్‌లో 443743 మంది పాస్ అయ్యారు. సైన్స్‌లో 454708 మంది ఉత్తీర్ణత సాధించారు. సోషల్‌ సబ్జెక్టులో 478483 మంది పాస్ అయ్యారు.
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన శాతం-86.60 %
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన బాలురు శాతం-84.68 %
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన బాలికల శాతం-  88.53 %
బాలురు కంటే బాలికల పాస్ పర్సంటేజ్‌ 3.85 శాతం ఎక్కువ
తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు హాజరైంది- 4,91,862
తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు హాజరైన బాలురు-243186
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన  బాలురు - 205930
తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు హాజరైన బాలికలు-2,41,184
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాసైన  బాలికలు- 2,13,530
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్‌ ఎక్కువ ఉన్న జిల్లా - నిర్మల్ జిల్లా (99%)
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్‌ తక్కువ ఉన్న జిల్లా -వికారాబాద్‌(59.46)
2793 స్కూల్స్‌లో వందకు వంద శాతం ఫలితాలు వస్తే.. 25 ప్రభుత్వం పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు.
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్‌ ఎక్కువ ఉన్న జిల్లా - నిర్మల్ జిల్లా
తెలంగాణ టెన్త్‌ పరీక్షల్లో పాస్ పర్సంటేజ్‌ తక్కువ ఉన్న జిల్లా -వికారాబాద్‌
తేడాది రిజల్ట్స్‌ చూస్తే...
గతేడాది తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్ద ఎత్తున ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 87.61 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 92.45 గా ఉంది. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 79 శాతంతో చివరి స్థానంలో ఉండిపోయింది.
రాష్ట్రంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లలో 80 7.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 75 శాతం 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని కేజీబీవీలలో 93.49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మైనార్టీ రెసిడెన్సిల్లో 93.73 శాతం, మోడల్ స్కూల్లో 97.25 శాతం ఉత్తీర్ణత, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల్లో 99.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీసీ గురుకులల్లో 97.47 మంది పాసయ్యారు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలలో 95.3 శాతం మంది పాసయ్యారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 98.1 శాతం నమోదు అయింది. 9 ప్రైవేటు పాఠశాలలో జీరో శాతం ఉత్తీర్ణత, 3 జిల్లా పరిషత్ హై స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.

Related Posts