YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి సేవలో ఏపి మంత్రి ఉషశ్రీ చరణ్

శ్రీవారి సేవలో ఏపి మంత్రి ఉషశ్రీ చరణ్

తిరుమల
తిరుమల శ్రీవారిని ఏపి మంత్రి ఉషాశ్రీ చరణ్ దర్శించుకున్నారు.. గురువారం ఉదయం ఉషాశ్రీ చరణ్ స్వామి వారి విఐపి విరామ సమయంలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం మంత్రి ఉషాశ్రీ చరణ్ కి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, మళ్ళీ ఏపి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఆమె తెలిపారు.. 2024లో ఖచ్చితంగా తాను ఎన్నికల బరిలో దిగుతూన్నట్లు ప్రకటించారు.. రాబోవు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ఉషాశ్రీ చరణ్ జోస్యం చెప్పారు..

శ్రీవారి సేవలో వకీల్ సాబ్ ఫేం  అనన్య
తిరుమల శ్రీవారిని హీరోయిన్ అనన్య దర్శించుకున్నారు..  ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అనన్య స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిజరూప దర్శనం చేసుకోవడం  అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.. తిరుమలకు రావడం చాలా సంతోషాన్ని కలిగిందని, మే నెలలో సర్ప్రైజ్ సినిమా రిజీజ్ కాబోతుందని, ప్రస్తుతం ఐదు సినిమాలో నటిస్తున్నట్లు అనన్య తెలిపారు..

Related Posts