YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక స్పీకర్ పదవికి బీజేపీ పోటీ

 కర్ణాటక స్పీకర్ పదవికి బీజేపీ పోటీ

ఒకవైపు కర్ణాటక రాజకీయ పరిణామాలు బీజేపీ వ్యతిరేక పక్షాలను ఒక వేదిక మీదకు తీసుకొచ్చాయనే విశ్లేషణలు వినిపిస్తుంటే మరోవైపు అక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రం తన పోరాటాన్ని ఆపడం లేదు. కుమారస్వామి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని స్పష్టం చేస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా యుద్ధానికి దిగారు. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుతో ప్రభుత్వం ఏర్పడింది. తమ ఒప్పందం ప్రకారం స్పీకర్ పదవిని కాంగ్రెస్‌కు వదిలిపెట్టింది జేడీఎస్. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎమ్మెల్యే కేఆర్ రమేశ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌ల బలం కలిస్తే స్పీకర్ గా రమేశ్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే బీజేపీ మాత్రం వెనక్కు తగ్గలేదు. బీజేపీ తరఫు నుంచి రాజాజీ నగర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ విధంగా కాంగ్రెస్, జేడీఎస్ కూటమితో బీజేపీ ఢీ అంటోంది. రేపు కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొననుంది. ఈ బలపరీక్షలో విజయం సాధించాకే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని కుమారస్వామి భావిస్తున్నారు. అయితే బీజేపీ కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ప్రస్తుతానికి బయటపడినా.. రానున్న ఆరు నెలల్లో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని బీజేపీ నేతలు బహిరంగ ప్రకటనలే చేస్తున్నారు

Related Posts