YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజారాజ్యం కంటే జనసేన డిజార్డర్ అవుతుంది తమ్మారెడ్డి

ప్రజారాజ్యం కంటే జనసేన డిజార్డర్ అవుతుంది తమ్మారెడ్డి

ఒకవైపు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర పేరుతో జనంతోకి దూసుకుపోతుంటే ఆయనపై ఆసక్తికర కామెంట్ చేశారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా. దేశంలో జరుగుతున్న సామాజిక, రాజకీయ అంశాలపై ‘నా ఆలోచన’ అనే కలం పేరుతో సోషల్ మీడియాలో తన అభిప్రాయాల్ని తెలియజేస్తున్న తమ్మారెడ్డి తాజాగా.. పవన్ రాజకీయ భవిష్యత్‌పై సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అనుసరించాల్సి వ్యూహాలు, కార్యాచరణ తదితర అంశాలపై సూచనలు, సలహాలను అందజేశారు తమ్మారెడ్డి. ఇలా కాకుండా మీరు మీ చుట్టూ ఉన్న ఆ నలుగురితోటే ఎలక్షన్స్‌లో పోటీ చేసేద్దాం అనుకుంటే.. అల్టిమేట్‌గా ప్రజారాజ్యంకంటే డిజాస్టర్ అవుతుంది. మీరు అర్ధం చేసుకోండి. మీరు వెళ్లండి ఊరూరా తిరగండి. బోలెడంత టైం ఉంది. మంచి వాళ్లని వెతకండి. మీ ఫ్యూచర్ ప్లాన్ చెప్పండి. ఇలా చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు‘రాష్ట్ర రాజకీయాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయ్.. ఒక పక్క చంద్రబాబు గారు.. మరో పక్క జగన్.. పవన్ కళ్యాణ్. వీళ్లే.. కాకుండా సందిట్లో సడేమియాలా కమ్యునిస్ట్ పార్టీలు కూడా అందరూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పట్టకుని ముందుకు వెళుతున్నారు. ఇక కర్ణాటక ఎన్నికల్లో సైతం మన తెలుగు వాళ్లు అక్కడకు వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారు అయితే అక్కడ బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. మనం తృప్తిపడే విషయం ఏంటంటే కర్ణాటకలో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న చోట్ల బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకుని ఆనందపడుతున్నామన్నారుఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. దేశంలో జరుగుతున్న ఎన్నో సమస్యల్ని జనం పట్టించుకోవడం లేదని కర్ణాటక ఎన్నికల రిజల్ట్‌ని బట్టి అర్థం అవుతోంది. ఒకవేళ పట్టించుకుంటే బీజేపీకి అన్ని ఓట్లు, సీట్లు రాకూడదు. ఇక ఏపీలో లేని బీజేపీ గురించి మనం మాట్లాడుతున్నాం.. మనం వాళ్ల గురించి మాట్లాడి మాట్లాడి ఏం చేస్తున్నాం అంటే.. బీజేపీకి 2019 ఎన్నికల టార్గెట్ ఏం లేదు. ఈ విషయం నాతో పాటు మీక్కూడా ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది. ఖచ్చితంగా 2019లో బీజేపీ అధికారంలోకి రాలేదు. మరి అధికారంలోకి రాలేనటువంటి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం. ఏపీలో అన్ని పార్టీలు కలిసి కట్టుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడొచ్చు కదా.. ఇప్పుడు ఈ పార్టీలు చేసేంది ఏంటంటే ఒకర్నొకరు తిట్టుకోవడం తప్ప ఏం చేయడం లేదు. ఇదంతా రాష్ట్రంలో జరుగుతున్న పాత కథే.. దీన్ని పక్కనపెడదామన్నారుఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు.. పోరాట యాత్ర చేపట్టారు. చాలా సంతోషం, కంగ్రాట్స్ పవన్ గారూ.. చాలా కాలం తరువాత యాత్రకు బయలు దేరారు. దీన్ని గర్వంగా భావిస్తా ఎందుకంటే.. గతంలో మీరు జనంలోని వెళ్లండి అని నేను చెబితే సెక్యురిటీ ప్రాబ్లం వస్తుందని వెళ్లనన్నారు. ఇప్పటికైనా జనంలోకి వెళ్లినందుకు ఆ క్రెడిట్ నేను తీసుకుంటా.. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా క్రెడిట్ తీసుకుని ఆనందపడతానని చెప్పుకొచ్చారు మీకు ఈ విషయం ఎందుకు చెబుతున్నా అంటే.. మీ చుట్టూ అంతా ఇప్పటికే ఓ కోటరీ ఉంది. ఇటీవల ఓ సమస్య కోసం ఓ కుర్రాడు నా దగ్గరకు వచ్చాడు. నేను పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాలి. మీరు చెప్పండి అన్నా.. ఈ బ్రోకరేజ్ నేనెక్కడ చేస్తానయ్యా.. నీ చావు నువ్ చావు అన్నా.. ఆ తరవాత అతడు మీ ఫ్యాన్స్ గురించి ఏవో మాట్లాడుతూ.. ఫేస్ బుక్‌లో ఏవో కామెంట్స్ పెట్టారు అవి నాకు అసంబద్ధమే కాని ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే.. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా మంది సమస్యను మీ దగ్గరకు తీసుకువస్తే పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. మిమ్మల్ని జనం నమ్ముతున్నారు. విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవల్సిన బాధ్యత మీపై ఉంది. ఇలా చేయాలంటే మంచి అభ్యర్ధుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. 175 మందిని మంచి ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది. 

Related Posts