దేశీయ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 318.20(0.93%) పాయింట్లు లాభపడి 34,663 వరకూ దూసుకెళ్లగా , మరో సూచీ నిఫ్టీ 83.50(0.80%) పాయింట్లు బలపడి 10,514 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో భారతీ ఎయిర్టెల్(4.18%), టీసీఎస్(3.20%), ఇన్ఫోసిస్(3.02%), యాక్సిస్ బ్యాంక్(2.65%), సన్ ఫార్మా(2.44%), టాటా స్టీల్(2.36%) భారీ లాభాలను గడించగా, మరో వైపు టాటా మోటార్స్(6.22%), ఓఎన్జీసీ(4.36%), బజాజ్ ఆటో(1.61%), మారుతి(0.73%), యెస్ బ్యాంక్(0.66%) అత్యధికంగా నష్టపోయాయి