హైదరాబాద్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ చేప ప్రసాదం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాదిమంది ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకున్నాం. బత్తిన హరినాధ్ గౌడ్ కుటుంబ సభ్యులు ఇచ్చే చేప ప్రసాదం పై ప్రజలకు ఎంతో నమ్మకం. కరోనా కారణంగా 3 సంవత్సరాల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయలేదని అన్నారు.