YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దూకుడు పెంచిన బీజేపీ

దూకుడు పెంచిన  బీజేపీ

విజయవాడ, జూన్ 10, 
ఇంకో ఆరు నెలల్లో తెలంగాణ ఎన్నికలు.. ఆ తర్వాత ఆరు నెలల్లో ఏపీ ఎన్నికలు.. సో.. సమయం లేదు మిత్రమా అంటోంది బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బీజేపీ నేతలు వరుస షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుని రాజకీయ వేడిపుట్టిస్తున్నారు. ఏపీలో 18 గంటల్లోనే రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించబోతోంది బీజేపీ. ఈ నెల 10న శ్రీకాళహస్తికి వస్తున్నారు. ఆ తర్వాత రోజే.. అంటే 11న విశాఖకి అమిత్ షా రాబోతున్నారు. ఇక ఈ నెల 15న ఖమ్మం జిల్లాలో అమిత్ షా పర్యటించబోతుండగా.. 25న నాగర్‌కర్నూల్‌లో ల్యాండ్ కాబోతున్నారు నడ్డా. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం తీసుకొస్తున్నారు.నడ్డా పర్యటన నేపథ్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఇప్పటికే కాషాయమయం అయింది. శ్రీకాళహస్తి ముఖద్వారం నుంచి, రామ సేతు వంతెన, నాలుగుమాఢ వీధులు, పెళ్లి మండపం, బేరి వారి మండపం వరకు కాషాయ జెండాలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తితో పాటు విశాఖ సభలను గ్రాండ్ సక్సెస్ చేసేందుకుపార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. బీజేపీ నేతలు స్పీడ్ పెంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. అటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. కేంద్ర మంత్రి అమిత్‌షా వరుస పర్యటనలు కాకరేపుతున్నాయి.

Related Posts