విజయవాడ
టీడీపీ ట్రాప్ లో బీజేపీ పడింది. టిడిపి నేతల మాటలే అమిత్ షా ప్రసంగమని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అసలు అమిత్ షా వైజాగ్ స్టేజ్ పై ఎవరున్నారో తెలుసు కదా..స్టేజ్ పై వున్నవారంతా టిడిపి నాయకులు. పసుపు కండువా తీసి కాషాయ కండువా వేసుకున్న నాయకులు స్టేజ్ పై వున్నారు. 2014_.19 వరకు టిడిపి తో మిత్ర పక్షంగా కొనసాగిన బిజెపి అప్పుడు ఏం చేసింది. టిడిపి అవినీతి తో బిజెపికి భాగస్వామ్యం లేదా . అమిత్ షా వైజాగ్ వచ్చి ఈ ప్రాంతం గురించి ఒక్క మాట చెప్పక పోవడం దారుణం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అమిత్. షా ఎందుకు మాట్లాడరని అయన ప్రశ్నించారు.
వైజాగ్ లో ఫార్మా రంగం అభివృద్ధి చేసింది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డని అయన అన్నారు.