YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

కడప
ఖైదీ పరారు విషయంపై డీఐజీ అదేశాల మేరకు ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ జైలులో రిమాండ్ ఖైదీ ఎం.నాగిరెడ్డిని కొం డాపురంలో ఓ దొంగతనం కేసుపై జమ్మలమడుగు కోర్టులో ప్రవేశపెట్టారు. తిరిగి ధార్వాడ జైలుకు తీసుకెళుతుండగా గురువారం రాత్రి కొండాపురం పోలీస్ స్టేషన్ లో పోలీసుల కళ్లగప్పి పరారయ్యాడు. ఈ విషయంపై కడప ఎఆర్ ఏఎస్ఐ సుధాకర్, ఎఆర్ పిసి నాయక్, ఏఆర్ పిసి దేవానంద్, కొండాపురం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఉత్తమరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శివశంకర్రెడ్డి, రాంబాబు, పి.వి రమణలను సస్పెండ్ చేశారు. పరారైన ఎం. నాగిరెడ్డి పై సుమారు 90 కేసులు ఉన్నట్లు సమాచారం. 

Related Posts