YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వారాహి యాత్రలోనూ దీక్ష

వారాహి యాత్రలోనూ  దీక్ష

రాజమండ్రి, జూన్ 21,
జనసేన పార్టీ  అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వారాహి విజయయాత్రలో బిజీగా ఉన్నారు. అయినా సరే ఉపవాస దీక్షకు సిద్ధమయ్యారు. ప్రజా సంక్షేమం కోసం వారాహి అమ్మవారి నవరాత్రులు, అనంతరం చాతుర్మాస దీక్ష ఉండటంతో నేటి నుంచి కార్తీక మాసం వరకు ఉపవాస దీక్ష ఆచరిస్తారు. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన తరుణంలో పవన్‌ కళ్యాణ్‌ ఉపవాస దీక్ష ఆచరించనున్నారు. ఉపవాస దీక్షను నవరాత్రులు చివరి మూడు రోజులు ఆచరించాలని తొలుత భావించారు. అయితే మంగళవారం నుంచే దీక్షను ప్రారంభించారు.ఈ దీక్షను నవరాత్రుల అనంతరం కార్తీక మాసాంతం వరకు కొనసాగిస్తారు. వచ్చే నెల గురుపౌర్ణమి నాటి నుంచి చాతుర్మాస దీక్ష కూడా ఎప్పటిలాగే ఆచరించనున్నారు. అందువల్ల ఈ ఉపవాస దీక్షను కార్తీక మాసాంతం వరకు కొనసాగించనున్నారు. దీక్షా కాలంలో పాలు, ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. లోక కల్యాణార్థం ఇటీవల మంగళగిరిలో మహాయాగం నిర్వహించిన నాటి నుంచి ఆయన శాకాహారానికి మాత్రమే పరిమితమయ్యారు. గతంలో కూడా ఆయన ఈ ఉపవాస దీక్ష పాటించిన సంగతి తెలిసిందే

Related Posts