తిరుపతి, జూన్ 26,
5 వందల కార్లు.. 2వేల మంది ప్రజాప్రతినిధులు.. భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన ప్రగతి భవన్ టూ మహారాష్ట్రకు బయలుదేరారు. సీఎం కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు సైతం మహారాష్ట్ర టూర్కు వెళ్తున్నారు. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రకు వెళ్లనుకున్న కేసీఆర్ను.. భారీ కాన్వాయ్ ఫాలో కాబోతోంది. కేసీఆర్తో పార్టీ ముఖ్యనేతలు మాత్రమే కాదు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ జిల్లా స్థాయి నేతలు కూడా బయల్దేరి వెళ్తున్నారు. పూర్తిగా రోడ్డు మార్గంలోనే సాగనున్న ఈ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్కు ఇవాళ సాయంత్రం వరకు చేరుకునేలా చేరుకునేలా ప్లాన్ చేశారు.షోలాపూర్లో పలువురు నేతలు గులాబీ కండువా కప్పుకోన్నారు. స్థానిక నాయకుడు భగీరథ్ బాల్కే.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. షోలాపూర్ చేనేత కార్మికులతోనూ కేసీఆర్ కలవనున్నారు. రాత్రికి షోలాపూర్లోనే బస చేయనున్న ముఖ్యమంత్రి.. ఉదయం పండరీపూర్ చేరుకుంటారు. విఠలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ దారాశివ్ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడుగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ నాగ్పూర్లో ఇటీవలే పార్టీ ఆఫీస్ను కూడా ప్రారంభించుకుంది. తాజాగా కేసీఆర్ రెండ్రోజుల పర్యటనలో ఆధ్యాత్మిక కోణమే కనిపిస్తున్నా.. విరామ సమయాల్లో జరిగే రాజకీయ మీటింగులు, చర్చలు మహారాష్ట్ర బీఆర్ఎస్కు మరింత బలాన్నిస్తుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతేకాకుండా పలువురు మహారాష్ట్ర నేతలు కూడా సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు.మహారాష్ట్ర పర్యటన కోసం సీఎం కేసీఆర్ స్వయంగా 400 మంది ముఖ్యనేతలకు ఫోన్ చేసి పలిపించినట్లు తెలుస్తుంది. దాదాపు 4గంటలపాటు భారీ కాన్వాయ్లో పయనించి.. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా ఒమర్గాకు చేరుకుంటారు. ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. సాయంత్రం 4.30కి సోలాపూర్ చేరుకొని.. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం మళ్లీ తిరుగు పయనం కానున్నారు.