నిజామాబాద్
ఎంఐఎం నేత అసదుద్దున్ ఓవైసీ వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. అసదుద్దున్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం భయటపడుతోంది. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు లేరు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనక నుండి కాదు. నేనేవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు. నా మీద ఎంఐఎం కౌన్సిలర్లు ముమ్మాటికీ హత్య యత్నం చేశారు. జైల్లో ఉన్న నిందితులపై సంఘ విద్రోహ,దొంగతనం, రౌడీయిజం, మర్థర్, ఇలా వారిపై చాలా కేసులున్నాయి. బోధన్ బిఅరెస్ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారని అయన ఆరోపించారు.