తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకంలో భాగంగా ఎకరానికి రూ. 4 వేలు మంజూరు చేయగా, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కి వచ్చిన చెక్కును ప్రభుత్వానికి బదలాయించారు. అయన కు ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, కిష్ట్టపురం గ్రామంలో 20.445 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, ఆయనకు ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రూ. 81,780 మంజూరు చేసింది. దీంతో చెక్కులు, భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలను తీసుకున్న డీజీపీ చెక్కును ప్రభుత్వానికి అదించారు.