YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జూలై 01 న జాతీయ వైద్యుల దినోత్సవం

జూలై 01 న జాతీయ వైద్యుల దినోత్సవం

-నేటి వైద్యులకు, వైద్య విద్యార్థులకు ఆదర్శ ప్రాయుడు డాక్టర్‌ బీసీ రాయ్‌ 
-వైద్యులందరికీ నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు
వైద్యో నారాయణో హరి అన్న నానుడి నిజం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరం తర సేవలకు ఈ మాత్రం గుర్తింపు చాల దేమా! ప్రతి వృత్తీ దేనికదే సాటి అయిన ప్పటికీ వైద్య వృత్తి వాటికి భిన్నమైనది. మృత్యువు చివర అంచులదాకా వెళ్లిన నిరంతర వారికి ప్రాణం పొసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే వైద్య వృత్తి పవిత్రమైనది. మన దేశంలో ప్రతియేటా జూలై 1న నేషనల్‌ డాక్టర్స్  డే ని జరుపుకుంటున్నాం. ప్రముఖ వైద్యు డు డా. బీసీ రాయ్‌ గౌరవవార్థం ఈ రోజు న నిర్ణయించారు. ఈయన 1882 జూలై 01 న జన్మిం చారు. మన దేశంలొ వైద్య రంగా నికి ఎనలేని సేవలందించిన బీసీ రాయ్‌ గౌర వర్థాం ఆయన జన్మ దినాన్ని డాక్టర్స్‌ డే పాటిస్తున్నారు. డాక్టర్‌ బీసీ రాయ్‌ పుట్టినరోజు ..మరణించిన రోజు ఒక్క రోజు .. జూలై ఒకటో తేదీ కావడం విశేషం. ఆయన 1962 జూలై ఒకటో తేదీన పొయాడు .డాక్టర్స్‌ బి.సి. రాయ్‌ 1882 జూలై ఒకటవ తేదీన బీహార్‌ రాష్ట్రం పాట్నా జిల్లాలోని బకిమ్‌ లో జన్మించారు. ఈయన పూర్తిపేరు బిధాన చంద్ర రాయ్‌.తండ్రి ప్రకాశ్‌ చంద్ర ఎక్త్సెజ్‌ ఇన్‌స్పెక్టర్‌. బీసీ రాయ్‌ తోబుట్టు వులు ఐదుగురు తన 14 వ యేట తల్లిని కొల్పో యారు. అవివాహితుడైన బీసీ రాయ్‌ తన ఆస్తు లతో పాట్నాలో ఓ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సామాజిక సేవలకు అంకితం చేశారు. బీసీ రాయ్‌ 1909-11 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ లోని సెంట్‌ బెర్త్‌ లో ఎమ్మార్సీపీ, ఎఫ్‌ ఆర్సీఎస్‌ డిగ్రీలు పొందడానికి చదువు కొన సాగించి 1911లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోలోకతా మెడికల్‌లో కొంతకాలం అధ్యా పకుడిగా పనిచేశారు. ఈయన జాదవ్‌పూర్‌ టీబీ హాస్పిటల్‌ , ఆర్జీ ఖార్‌ మెడికల్‌ కాలజీ ,కమలా నెహ్రూ హాస్పిటల్‌ ,విక్టోరియా ఇన్‌స్టిట్యూట్‌ , చిత్త రంజన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ మొదలైన సంస్థలు నెలకొల్పాడు. 1926లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల చిత్తరంజన్‌ సేవా సదన్‌ అనే వైద్య శాలను ఏర్పాటు చేశారు. మహిళలకు నర్సింగ్‌ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థమా ఏర్పాటు చేశాడు.1925లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బారక్‌ పూర్‌ అసెంబ్లీ నియెజక వర్గం నుంచి పోటీ చేసి గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ బెంగాల్‌ గా పేరొందిన సురేంద్రనాథ్‌ బెనర్జీని ఓడిం చారు.1922-28 మధ్యకాలం కోల్‌కతా మెడి కల్‌ జర్నల్‌కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వ ర్తించారు. 1928లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులుగా నియామకమయ్యారు. 1993 లో కోల్‌కత్తా నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1942 లొ కొల్‌కత్తా విశ్వ విద్యాయానికి వైస్‌ చాన్స్‌లర్‌గా, 1943లో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా నియమింపబడ్డారు.విద్యా,వైద్య రంగాల్లో ఈయన సేవలకు 1944లో గౌరవ డాక్టకేట్‌కు ప్రదానం చేశారు. 1948 జన వరి 13న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.1961లో ఫిబ్రవరి 4న ఈయన భారత రత్న వరించింది. వీరి జయంతి రోజైన జూలై ఒక టినే వర్ధంతి కూడా కావడమే విశేషం. ఈయన స్మారకార్థం ప్రతీ ఏడూ జూలై ఒకటన తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962లో ప్రకటించింది .వివిధ రంగా ల్లో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్‌ బీసీ రాయ్‌ పేరిట అవార్డులను ప్రదానం చేస్తున్నారు. నేటి వైద్యులకు, వైద్య విద్యార్థులకు ఆదర్శ ప్రాయుడు డాక్టర్‌ బీసీ రాయ్‌.

Related Posts