Highlights
- పుణ్యక్షేత్రం లో లేని కనీస వసతులు.
- పట్టనట్లు వ్యవహరిస్తున్నదేవాలయ అధికారులు.
తెలంగాణ పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి చెందిన యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భక్తులకు అసౌకర్యమైన దర్శనం తాండవిస్తుంది. వేసవికాలం లో దేవస్థానం కనీసం తాగు నీటి సౌకర్యం సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం తో భక్తులు నానా తంటాలు పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కావడం తో భక్తులు భారీగానే వస్తున్నారు. అదే విధంగా ఆదాయం కూడా బాగా పెరిగింది. లక్ష్మినరసింహ స్వామి దర్శనం కోసం విదేశీయులు కూడా రావడం తో స్వామి వారికీ లక్షలలో ఆదాయం వస్తుంది. కానీ భక్తులకి కనీస సౌకర్యలు కలిపించడంలో ఆలయ అధికారులు విఫలమవుతున్నారు. దూర ప్రాంతాలు నుంచి వచ్చే భక్తులు నానా తంటాలు పడుతున్నారు.