YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మంటలకు బస్సు ఆహూతి… 25 మంది సజీవదహనం

మంటలకు బస్సు ఆహూతి… 25 మంది సజీవదహనం

పుణె
మహారాష్ట్రలో శనివారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ పై వెళ్తున్న ఓ బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవదహనమయ్యారు. ఘటనలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. 32 మంది ప్రయాణికులతో బస్సు యావత్మాల్ నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.  మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టైరు పేలి బస్సు బోల్తా పడటంతో.. మంటలు చెలరేగి ఈ విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

Related Posts