సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో దేవాదాయ, జీహెచ్ ఎంసీ, మున్సిపల్ ప్రభుత్వ స్థలాలలో నివసిస్తున్న పేదల కు సంబంధించిన క్రమబద్దీకరణ, ఇతర సమస్యల పై రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సచివాలయంలో ని తన చాంబర్ లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని జీరా, ఆదయ్య నగర్, సజన్ లాల్ స్ట్రీట్, నాగరాజేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజల సమస్యల పై సమీక్ష జరిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల సమయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతర తీసుకున్న చర్యల పై మంత్రి సమగ్రంగా చర్చించారు. జీరా లోని దేవాదాయ శాఖ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న సమస్యల పరిష్కానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ ఆదేశాలు అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు