YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండికి సంఘ్ మద్దతు

బండికి సంఘ్ మద్దతు

హైదరాబాద్, జూలై 5, 
తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై అధినాయకత్వం మరోసారి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్‌ను ఢిల్లీ పిలిచి మాట్లాడిన హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సైలెంట్‌గా పరిస్థితులు గమనిస్తోంది. బండి సంజయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు గట్టిగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకొచ్చింది బండి సంజయ్‌. ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరిని అడిగినా చెప్తారు. అదే టైంలో పార్టీలో వర్గాలు కూడా ఎక్కువ అయ్యాయి అనేది కఠోర సత్యం. దీని ఫలితంగానే బండి సంజయ్‌ మార్పు ఖాయమని చాలా మంది అనుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో అందర్నీ కలుపుకొని వెళ్లే వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని, దూకుడు కంటే వ్యూహాత్మకంగా వెళ్లే వ్యక్తి అసవరం అవుతాడని పార్టీ హైకమాండ్ ఆలోచన. అందుకే కిషన్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది. బండి సంజయ్‌ మార్పును ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి తెలంగాణలో మైలేజ్ తీసుకు రావడంపై మరో వ్యక్తిని నియమించడం పైకొనితెచ్చుకున్నట్టేనని కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపించినట్టు అవుతుందని ఆ విభాగం వాదిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సవాల్‌ చేయడంలో సంజయ్ విజయం సాధించారని, తెలంగాణలో బీజేపీని తన సమీప ప్రత్యర్థిగా గుర్తించేలా అధికార పార్టీని పరుగెత్తించారని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.  ఈ సమయంలో బండి సంజయ్‌ను తప్పిస్తే పార్టీ కేడర్‌ ఒక్కసారిగా డీలాపడిపోతందని వాదిస్తున్నారు. తెలంగాణ పరిణామాలను బీజేపీ హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది. సంజయ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో నడుస్తున్న క్యాంపెయిన్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. ఆయన అభిమానులు, బీజేపీ అభిమానులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాలోవర్స్ పెడుతున్న పోస్టింగ్స్‌పై బీజేపీ అధినాయకత్వం దృష్టికి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సోమవారం ప్రకటించాల్సిన నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం వాయిదా వేసుకుంది. దీన్ని ఇంకా లాగడం కూడా మంచిది కాదని భావిస్తోంది. సంజయ్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటు ఇచ్చి అనుకున్న మార్పులు కంటిన్యూ చేయడమా.. లేకుంటే బండి సంజయ్‌ను కంటిన్యూ చేయడమా అనేది తేల్చేయనుంది. దీనిపై ఇప్పటికే మథనం మొదలు పెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం... ఒకట్రెండు రోజుల్లో ఓ నిర్ణయం ప్రకటించనుంది.బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్ బన్సల్‌  హైదరాబాద్ వస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండే తీసుకోవాల్సిన మార్పులపై అభిప్రాయసేకరణ చేయనున్నారు. వీటితోపాటు కొద్ది రోజులుగా నేతలు వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలను కూడా కూల్ చేసేందుకు ఆయన మీటింగ్స్ పెడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిర్వేదంలో బండి సంజయ్
మన జీవితంలోని కొన్ని అధ్యాయాలు ముగింపు దశకు రాకముందే ముగిసిపోతుంటాయి " అని తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వేదం వ్యక్తం చేశారు.  తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించిన బీజేపీ అధిష్ఠానం, ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయ‌న సోషల్ మీడియాలో భావోద్వేగంతో ఓ పోస్ట్ పెట్టారు.  తన పదవీకాలంలో విచారించదగ్గ ఘటనలేవీ లేకపోవడం సంతోషదాయకమని, అందరూ కూడా మర్చిపోలేని మధురానుభూతులు అందించారని పేర్కొన్నారు. అరెస్టుల సమయంలో, దాడులకు గురైన సమయంలో, ఉల్లాసంగా ఉన్నప్పుడు కూడా వెన్నంటి నిలిచారని ధన్యవాదాలు తెలిపారు.  కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటంలో కార్యకర్తల పాత్ర ఎనలేనిదని, వారికి హేట్సాఫ్ చెబుతున్నానని వెల్లడించారు. అరెస్ట్ లకు, దాడులకు భయపడకుండా, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. వాన లేదు, ఎండా లేదు… కార్యకర్తలు అన్ని వేళలా తనకు తోడుగా ఉన్నారని బండి సంజయ్ ప్ర‌శంస‌లు కురిపించారు. తన పదవీకాలంలో పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే, తనను క్షమించాలని, వారి ఆశీస్సులు అందించాలని కోరారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో మద్దతు ఇచ్చి, ప్రేమాభిమానాలు ప్రదర్శించిన కార్యకర్తలకు, ప్రోత్సహించిన బీజేపీ కేంద్ర నాయకత్వానికి, తెలంగాణ బీజేపీ నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాసంగ్రామ యాత్రలో మనస్ఫూర్తిగా స్వాగతించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ముఖ్యంగా, తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన కరీంనగర్ ఓటర్లకు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బండి సంజయ్ వివరించారు. అరెస్ట్ లకు,  దాడులకు భయపడకుండా, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. వాన లేదు, ఎండా లేదు… కార్యకర్తలు అన్ని వేళలా తనకు తోడుగా ఉన్నారని బండి సంజయ్ ప్ర‌శంస‌లు కురిపించారు. తన పదవీకాలంలో పొరబాటున ఎవరినైనా బాధించి ఉంటే, తనను క్షమించాలని, వారి ఆశీస్సులు అందించాలని కోరారు.          

Related Posts