YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బోల్తా పడిన ప్రైవేట్ స్కూల్ బస్సు

బోల్తా పడిన ప్రైవేట్  స్కూల్ బస్సు

పల్నాడు
పల్నాడు జిల్లా నరసరావుపేట లో దారుణం జరిగింది.  విధ్యార్ధులకు  ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనలో ఓ విద్యార్థి తొంటికి తీవ్ర గాయం కాగా  15 మంది విధ్యార్ధులకు స్వల్ప గాయాలుఅయ్యాయి. ఆక్స్ఫర్డ్ స్కూల్ కి చెందిన స్కూలు బస్సు బుధవారం ఉదయం పమిడిమర్రు గ్రామం దగ్గర బోల్తా కొట్టింది. ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్  డ్రైవింగ్ చేశాడని ప్రత్యక్ష సాక్షుల ఆరోపించారు. స్థానికులు విధ్యార్ధులను రక్షించి బస్సు నుండి బయటికి తీసారు. పామిడిమార్రు నుండి నరసరావుపేట వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. రోడ్డుపై వాహనం అడ్డుగా ఉన్న క్రమంలో అడ్డు తప్పించబోయి బస్సు బోల్తా పడింది. విద్యార్థులను తల్లిదండ్రులు  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Posts