YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నోరు జారాను ..క్షమించండి : ఎంపీ మురళీ మోహన్

నోరు జారాను ..క్షమించండి : ఎంపీ మురళీ మోహన్

రాజమండ్రి మినీ మహానాడులో తాను తిరుపతి ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుజారి అన్నానని మురళీమోహన్ క్షమాపణలు తెలిపారు. అప్పటివరకూ వేదికపై బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతున్న తాను, వెంటనే ప్రసంగానికి పిలవడంతో సభలో మాట్లాడుతూ వెంకన్న చౌదరి అనడం జరిగిందే తప్ప ఉద్దేశ పూర్వకంగా వచ్చింది కాదని ఆవేదన చెందారు .ఏడుకొండల వాడంటే తనకు ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయంటూ నోరుజారి అన్నమాటకు సోషల్ మీడియా, ఇతర ఛానళ్లలో దుష్ప్రచారం చేయడం పట్ల వాపోయారు. స్వామివారితో పాటుగా భక్తులు అందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ తనకు అన్నికులాలు సమానమేనని,కుల దురభిమానం లేదని అన్నారు. ఏడుకొండలవాడికి కులం ఆపాదించే తెలివితక్కువ వాడిని కానంటూ, పొరపాటున వచ్చిన మాటకు పెద్దమనసుతో క్షమించాలని కోరారు. ఈరోజు ఉదయమే ఏడుకొండలవాడి పూజ సందర్భంగా దీనిపై స్వామివారిని మన్నింపు వేడుకొన్నట్లుగా పేర్కొన్నారు.

Related Posts