YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భద్రకాళి ని దర్శించుకున్న ప్రధాని

భద్రకాళి ని దర్శించుకున్న ప్రధాని

వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోసేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత భద్రకాళి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ విజయ సంకల్ప సభకు బయల్దేరారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్నారు.  కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ, పీవోహెచ్లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు సభా వేదిక నుంచే ప్రధాని శంకుస్థాపన చేసారు.

Related Posts