వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోసేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత భద్రకాళి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ విజయ సంకల్ప సభకు బయల్దేరారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్నారు. కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ, పీవోహెచ్లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు సభా వేదిక నుంచే ప్రధాని శంకుస్థాపన చేసారు.