YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా వైఎస్సార్ జయంతి

ఘనంగా వైఎస్సార్ జయంతి

గోకవరం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. గోకవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత  రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్సిపి పార్టీ కుటుంబ సభ్యులు  పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు  జయంతి సందర్భంగా  కేక్ కట్ చేశారు  దివంగనేత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సుంకర శ్రీవల్లి దివంగత నేత రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటూ వృద్ధులకు స్వీట్లు దుప్పట్లు అందజేశారు ఈసందర్భంగా..ఉభయగోదావరిజిల్లాల ఎస్సీ సెల్ జోనల్ ఇన్చార్జి గుల్ల ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ    రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు ఆయన లేని లోటుని తన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ రాష్ట్రంలో రైతులకు అండగా ఉంటూ ప్రజల సంక్షేమ కోసం పనిచేస్తున్నారని కొనియాడారుఈ కార్యక్రమంలో... జడ్పిటిసి దాసరి శ్రీరంగ రమేష్,
ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, కర్రీ సూరారెడ్డి, వైస్ ఎంపీపీ మడికి మైనర్ బాబు, నరాశెట్టి నరసయ్య, చింతల అనీలు, ఐజిన్న,కిరణ్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts