YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సినిమా స్టోరీ చెప్పిన స్వర్ణలత

సినిమా స్టోరీ చెప్పిన స్వర్ణలత

విశాఖపట్టణం, జూలై 17, 
విశాఖలో నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలిగా ఉన్న సీఐ స్వర్ణలత ఒక్కరోజు కస్టడీ ముగిసింది. ఆమెను గురువారం ఉదయం జైలు నుంచి తీసుకొచ్చి ఎంవీపీకాలనీ పోలీసుస్టేషన్‌లో ప్రశ్నించారు.. అనంతరం శుక్రవారం ఉదయం ఆమెను కేజీహెచ్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేసి తిరిగి జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో స్వర్ణలత సంచలన విషయాలు వెలుగలోకి వచ్చాయి. మోసం చేయాలన్న కుట్రలో భాగంగానే రూ.2వేల నోట్ల మార్పిడి డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ నేవీ ఉద్యోగులు స్వర్ణలత ముఠా ఆలోచనలు ముందే పసిగట్టినట్లు సమాచారం. రూ.12లక్షలు ఒక బ్యాగ్ లోను.. మిగిలిన డబ్బులు డిక్కీలో స్టెప్నీ టైర్ కింద ఉంచారు.స్వర్ణలత సినిమా స్టోరీలు చెప్పి విచారణ అధికారులను మభ్య పెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు నోట్లు మార్పిడికి సిద్ధంగా గ్యాంగ్ చెప్పారట. నేవీ ఉద్యోగులు 90 లక్షలు తెచ్చిన మాట నిజమే కానీ రూ. కోటి తాము తీసుకుని వెళ్ళలేదని చెప్పారు. రూ.2వేల నోట్ల మార్పిడి దందాను విచారణ అధికారులు ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తి ఉండటమే కొంపముంచిందని స్వర్ణలత కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. షూటింగ్‌లోనే ఏ-1 సూరి ద్వారా మరో పెద్ద వ్యక్తి పరిచయమైనట్లు విచారణలో ఆమె చెప్పారట.ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నేరానికి సిద్ధపడినట్టు సీఐ స్వర్ణలత అంగీకరించారట. కేవలం తాను డబ్బుకు ఆశపడి మాత్రమే తప్పు చేసినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు భార్య జైలులో ఉన్న సరే.. సీఐ స్వర్ణలత భర్త అమెరికా నుంచి ఇండియాకి రాలేదని చెబుతున్నారు. ఆమె భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో చదువుతున్న స్వర్ణలత కుమారుడు కూడా ఇప్పటి వరకు ఆమెను చూడటానికి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు.రూ.2వేల నోట్ల మార్పిడి పేరుతో రిటైర్ నేవి ఉద్యోగుల్ని బెదిరించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై సీఐ స్వర్ణలత, మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. స్వర్ణలత ముఠా ఆలోచనలు ముందే పసిగట్టిన రిటైర్డ్ నేవీ ఉద్యోగులు.. రూ.12 లక్షలు ఒక బ్యాగ్ లోను.. మిగిలిన నగదు డిక్కీలో స్టెఫీన్ టైర్ కింద ఉంచారని తేల్చారు.. అయితే, విచారణ సమయంలో సినిమా స్టోరీలు చెప్పి అధికారులను మభ్య పెట్టే ప్రయత్నం స్వర్ణలత చేస్తున్నారట.. కానీ, డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు కనుక మర్యాదగా అడుగుతున్నాం.. నిజాలు చెప్పండని సీనియర్ ఆఫీసర్ క్లాస్‌ తీసుకున్నాడట.అయితే, స్వర్ణలత అండ్ గ్యాంగ్ వెల్లడించిన సమాచారంతో షాక్ అయ్యారు విచారణ అధికారులు.. పెద్ద ఎత్తున నోట్లు మార్పిడికి సిద్ధంగా ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేసిన గ్యాంగ్.. నేవీ ఉద్యోగులు 90 లక్షలు తెచ్చిన మాట నిజమే.. కానీ, కోటి రూపాయలు తాము తీసుకుని వెళ్ళలేదని వెల్లడించింది.. కాల్ డేటా ఆధారంగా నిందితులు ఇచ్చిన సమాచారం నిర్ధారించుకుంది విచారణ బృందం.. ఇక, రెండు వేల నోట్ల మార్పిడి పేరుతో దందాను విచారణ అధికారులు ఎదుట అంగీకరించింది ముఠా.. ఓ రాజకీయ నాయకుడు ప్రమేయంపై అనుమానం తలెత్తడంతో నివృత్తి చేసుకున్నారు పోలీసులు.. అయితే, సినిమాల మోజే కొంప ముంచిందని విచారణ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారట సీఐ స్వర్ణలత.. షూటింగ్ లోనే ఏ-1 సూరి పరిచయం అయినట్టు చెప్పిన రిజర్వ్డ్ ఇన్‌స్పెక్టర్.. ఏ1 సూరి, కానిస్టేబుల్, హోంగార్డు ఒత్తిడితోనే నేరానికి సిద్ధపడినట్టు తెలిపారట.. అంతా సూరిబాబే చేశాడు.. నా పాత్ర నామమాత్రమే అని చెప్పారట.. అసలు విషయం దాటవేస్తూ.. తన కెరీర్‌ పాడైపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారట స్వర్ణలత.. అయితే, సీజ్ చేసిన ఫోన్‌లోని డేటాతో తన వ్యక్తిగత జీవితం ముడిపడి ఉందని ఆమె ప్రాధేయపడ్డారట.. ఇక, డీసీపీ పర్యవేక్షణలో 24 గంటలు దర్యాప్తు కొనసాగింది.. స్వర్ణలత అభ్యర్ధనలు అధికారులు పట్టించుకోలేదు.. జాలిపడితే మా జీవితాలు కాలిపోతాయని కఠినంగా చెప్పారట ఉన్నతాధికారులు.సీఐకు సినిమాలంటే పిచ్చి.. ఈ క్రమంలోనే ఓ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. స్వర్ణలత డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ సినిమాలో హీరోయిన్‌ అంటూ వార్తలురాగా.. డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.విశాఖ సీఐ స్వర్ణలత కేసులో 'సినిమా' ట్విస్టులుసీఐ స్వర్ణలత తమ సినిమా ‘ఏపీ 31’లో హీరోయిన్‌ కాదని దర్శకుడు కేవీఆర్‌ తెలిపారు. తమ సినిమాలో సీఐ ఓ అతిథి పాత్రలో మాత్రమే ఆమె నటించారన్నారు. ఈ మూవీలో ఆమె పెట్టుబడులు పెడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న స్వర్ణలత డ్యాన్స్‌ వీడియోలు తమ సినిమాలోవి కాదని చెప్పారు. తాము తీస్తున్న మూవీలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ లహరి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కేవీఆర్‌ తెలిపారు. తమ చిత్రంపై సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదన్నారు.

Related Posts