YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతన్న సన్నాహక సమావేశం లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

రైతన్న సన్నాహక సమావేశం లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

వరంగల్
పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం రైతు వేదికల వద్ద రైతన్న సన్నాహాగా సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మంత్రి  మాట్లాడుతూ   24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత బి ఆర్ ఎస్ పార్టీ ది అని అన్నారు. రైతుబంధు పథకం, రైతు బిడ్డ కు  ఇన్సూరెన్స్, కే సీ ఆర్ రైతుల మేలు కోరే మన ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు.  సంవత్సరానికి మూడు సార్లు పంటలు పండే విధంగా చేసినా ఘనత బిఅర్ఎస్ పార్టీ దని అన్నారు.  రైతే రాజు అన్నారు.  ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుస్కురీ శ్రీనివాస్ రావు, జిల్లా కోఆఫ్షన్ మెంబర్ యం డి మధర్, ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ బొబ్బల అశోక్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, పాలకుర్తి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు పసూనూరి నవిన్ కూమార్,ఆయా గ్రామాల  సర్పంచ్ లు భాస్కర్ రెడ్డి, ఇమ్మడి ప్రకాష్, ఇంద్ర రెడ్డి,బాలు నాయక్, దేవా నాయక్, ఎం పి టి సి లు , రైతులు మరియు మహిళలు ,బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన నాయకులు సోషల్ మీడియా వారియర్స్ అభిమానులు తదితరులు  పాల్గొన్నారు.

Related Posts