YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్క చెల్లెల జంట హత్య కలకలం

అక్క చెల్లెల జంట హత్య కలకలం

నిజమాబాద్
పట్టణ కేంద్రంలో జిరాయాత్ నగర్ లో నివసిస్తున్న ఇద్దరు అక్కచెల్లెలను రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించిన ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది.
ఆర్మూర్ పట్టణంలోని జిరాయాత్ నగర్ లో నివసిస్తున్న ఇద్దరు అక్క చెల్లెలు మగ్గిడి గంగవ్వ (62), మగ్గిడి రాజవ్వ (72) లను అర్ధరాత్రి వారు నివసిస్తున్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం గత 20 సంవత్సరాలుగా ఇద్దరు అక్క చెల్లెలు ఒంటరిగా నివసిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మల్లన్న గుట్ట వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగలో పాల్గొన్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం గంగవ్వ కుమారుడు వారిద్దరిని మామిడి పల్లి నుండి జిరాయాత్ నగర్ లోని మృతులు ఉంటున్న ఇంట్లో దిగపెట్టి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం వేకువజామున ఇంట్లో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కిటికీలు బద్దలు కొట్టి మంటలు ఆర్పే క్రమంలో మృతులు ఇద్దరు కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం డాగ్బ్స్వాడ్ తనిఖీలు నిర్వహించారు.  వృద్ధ మహిళల వద్ద ఒంటినిండా సుమారు 15 నుండి 25 బంగారం ఉంటుందని స్థానికులు చెప్పారు. నగలు, బంగారం కోసం దుండగులు ఎవరైనా వీరిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సి సి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు...

Related Posts