హైదరాబాద్, జూలై 25,
కర్ణాటక ఎన్నికల తర్వాత జోష్ మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఈ నెల 30వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే రాహుల్ గాంధీ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ప్రియాంక గాంధీ ఇబ్రహీంపట్నం సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ కొల్లాపూర్ సభలో మహిళ డిక్లరేషన్ ప్రకటించబోతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే కాంగ్రెస్ మహిళ డిక్లరేషన్లో ఎలాంటి అంశాలు ఉంటాయి అనే అంశంపై ఇప్పుడు ఆసక్తిగా చర్చ నడుస్తుంది. కర్ణాటక తరహాలో మహిళలకు ఆర్టీసీ బస్లో ఉచిత ప్రయాణం హామీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నుండి తెలుస్తుంది. అంతే కాకుండా మరో 4 కీలకమైన హామీలు ఉండబోతున్నాయనీ తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ఎలాంటి హామీలను తెలంగాణ మహిళలకు ఇస్తారు అనేది చూడాలి.