హైదరాబాద్
టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ట్వీట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ మానిప్యులేటర్ అంటూ మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి అంటూ ట్వీట్ చేసారు. టీఎస్-ఐపాస్ కింద ప్రభుత్వం తప్పుడు సమాచారం అందించిందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అన్నది. లేని ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపిస్తున్నట్లు ఆర్టీఐ ద్వారా ఋజువైందని పద్మనాభరెడ్డి ప్రకటించారు.
ఒక దినపత్రిక కథనాన్ని జత చేస్తూ రేవంత్ ట్వీట్ చేసారు. డ్రామారావు మరో డ్రామాను తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాలంటూ ట్వీట్ లో పేర్కోన్నారు.