YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సముద్రంలో పడవ బోల్తా..ఒకరు మృతి

సముద్రంలో పడవ బోల్తా..ఒకరు మృతి

శ్రీకాకుళం
సముద్రంలో వేటకు వెళ్లిన పడవ బోల్తా పడటంతో ఒకరు మృతిచెందారు.  సోంపేట మండలం ఇసకలపాలెం గ్రామానికి  చెందినవారుగా గుర్తించారు.  మంగళవారం వేకువజామున 4 గంటలకు ఇసకలపాలేనికి చెందిన ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు.   పడవ బోల్తా పడటంతో గంట జనార్దన (40) సముద్రంలో పడి మృతిచెందగా.. బైపల్లి తులసయ్య గల్లంతయ్యారు.  మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.  జనార్దనను కాపాడేందుకు తోటి మత్స్యకారులు విఫలయత్నం చేసినా ఫలితం లేకపోయింది.  గల్లంతైన తులసయ్య కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఆయన మరో పడవను ఆశ్రయించి ఒడ్డుకు చేరినట్లు తెలుస్తోంది.  గంట జనార్దన మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Related Posts