YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇండియా కెప్టెన్ ఎవరు...

ఇండియా కెప్టెన్ ఎవరు...

న్యూఢిల్లీ, జూలై 28, 
ఇండియా కూటమికి సారథ్యం వహించే నేత ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాబట్టి యుపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ  పేరు వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. 2004 నుంచి యుపీఏ చైర్ పర్సన్ గా ఉంటున్న సోనియాగాంధీ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గత పది  రోజుల నుంచి ఇండియా కూటమికి నేత ఎవరు అనే చర్చ కొనసాగుతోంది. యుపీఏ చైర్ పర్సన్ గా ఆమె సమర్ధవంతంగా పని చేశారు.2ేే004 నుంచి 2014 వరకు బలమైన ఎన్డిఏ  కూటమిని మట్టి కరిపించి రెండు పర్యాయాలు అధికారంలో తీసుకురావడంలో సోనియా గాంధీ ముఖ్య భూమిక  వహించిన సంగతి తెలిసిందే.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 26 ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 'ఇండియా' పేరుతో ఏర్పడిన ఈ కూటమికి నాయకత్వం వహించేది ఎవరని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు మార్లు సమావేశం అయినప్పటికీ కూటమికి నాయకుడిని ఎన్నుకోవడంపై ప్రతిపక్షాలు ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం ఈ విషయంపైనే బీజేపీ సహా ఎన్డీయే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాల కూటమిని ముందుండి నడిపించే నాయకుడే లేడని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ఇండియా కూటమికి నాయకుడు ఎవరన్న ప్రశ్నకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే స్పందించారు.
ఇండియా కూటమికి నాయకుడంటూ ఎవరూ లేరని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించేందుకు తామంతా కూటమిగా ఏర్పడ్డామని, కూటమిలోని పార్టీల ఉమ్మడి లక్ష్యం అదేనని వివరించారు. కూటమికి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం అంతగా లేదని చెప్పారు. జనాలకు పెద్దగా తెలియని వ్యక్తులు కూడా అవకాశం రాగానే తమలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి అందరి మెప్పును పొందారని చెప్పారు. చరిత్రలో ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని ఉద్ధవ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు ఇందుకు చక్కని ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ హఠాన్మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని ఉద్ధవ్ గుర్తుచేశారు.
బీఆర్ఎస్ కలుస్తుందా...
కొన్ని రోజులుగా బిజెపికి బీ టీంగా పనిచేస్తున్న బిఆర్ఎస్  సడెన్ గా ప్లేట్ మార్చింది. విపక్ష కూటమి ఏర్పాటు చేసిన పాట్నా, బెంగుళూరు సమావేశాలకు దూరంగా ఉన్న బిఆర్ఎస్ ఎన్డియేపై అసమ్మతి నోటీసు ఇచ్చి కొత్త రాజకీయ సమీకరణాలకు ఆజ్యం పోసింది. ఐదేళ్ల క్రితం మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కెసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్  మోదీ వెంట ఉన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ను వ్యతిరేకించిన కెసీఆర్ పార్టీ లోకసభలో ప్రవేశ పెట్టిన అసమ్మతి నోటీసుతో తిరిగి విపక్ష కూటమి ఇండియాకు చేరువ కావాలని చూస్తున్నారు. మణిపూర్ హింసను నిరసిస్తూ బిఆర్ఎస్  మోదీప్రభుత్వంపై అసమ్మతి నోటీసు ఇచ్చింది. బిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు లోకసభలో అసమ్మతి నోటీసు జారీ చేశారు. ఆయన వెంట ఎంఐఎం కూడా ఉంది. ఇటీవలె బిఆర్ఎస్ కు దూరమైన ఎంఐఎం మణిపూర్ హింసపై ప్రవేశపెట్టే అసమ్మతి నోటీసుకు మద్దత్తుగా నిలిచింది.ఎంఐఎం కూడా అసమ్మతి నోటీసు ఇచ్చింది. ఎంఐఎం మాత్రం కాంగ్రెస్ కు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.భాగ్యలక్ష్మి వివాదంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపీఏ నుంచి ఎంఐఎం వైదొలగింది. ఎంఐఎం మొదటి నుంచి కాంగ్రెస్ కు దగ్గరగా ఉండేది. తిరిగి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చూస్తుంది. లిక్కర్ స్కాంలో కెసీఆర్ కూతురు కవిత పేరు ఉండటంతో కొన్ని రోజులుగా బిజెపిని కానీ, మోదీ ప్రభుత్వాన్ని కెసీఆర్ పల్లెత్తు మాట అనడం లేదు. బిజెపికి  బిఆర్ఎస్ బీటీంగా మారిపోయిందని ప్రచారం జరిగింది. కవిత అరెస్ట్ ను అడ్డుకోవడానికి కెసీఆర్ స్వయంగా బిజెపి అధిష్టానంతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్  ను మార్చడానికి ఎక్కువ దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వంపై అసమ్మతి నోటీసు కెసీఆర్ హైడ్రామా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉత్తుత్తి అసమ్మతి నోటీసు అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు అన్నారు. దక్షిణాదిలో కర్ణాటక నుంచి  విక్టరీ సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా గెలవవచ్చు అని పలు సర్వేలు చెబుతున్నాయి. కెసీఆర్ తెప్పించుకున్న సర్వేలో కూడా కాంగ్రెస్ విక్టరీ ఉండటంతో కర్ణాటక ఫలితాల తర్వాత కెసీఆర్ కు కాంగ్రెస్ భయం పట్టుకుంది. ప్రతీ సారీ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.

Related Posts