సంగారెడ్డి
సంగారెడ్డి పట్టణం బాలాజీనగర్ కాలనీలో వీధి కుక్కులు వీరంగం సృష్టించాయి. ఐదు కుక్కలు వెంబడించి ఒక బాలుడిపై దాడి చేసాయి. పిల్లలు ఆడుకుంటుండగా వారిని కుక్కలు వెంబడించాయి. చిన్నారులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఓ చిన్నారి అక్కడే పడిపోవడంతో బాలుడిపై దాడి చేసి కరిచాయి. పక్కనే ఉన్న ఓ మహిళ వీధి కుక్కలను తరమడంతో బాలుడు గాయాలతో బయటపడ్డాడు.