YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పురందేశ్వరీ వ్యాఖ్యాలు సరికావు

పురందేశ్వరీ వ్యాఖ్యాలు సరికావు

పార్వతీపురం మన్యం
జిల్లా కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.
మంత్రి బొత్స మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పై కౌంటర్ ఇచ్చారు.  పురంధేశ్వరి సంక్షేమం, అభివృద్ధి వదిలేసి రాష్ట్రంలో అప్పుల్లో ఉందని  వ్యాఖ్యానించడం సరికాదు. మరి దేశంలో బిజెపి పార్టీ పరిపాలన చేస్తున్న రాష్ట్రలు అప్పులు గురించి ఎందుకు మాట్లాడటం లేదు .
పార్లమెంటు లో మీ బిజెపి ఎంపీ దేశంలో అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని ప్రస్తావించారు. మరి మిగిలిన ఆరు స్థానాల్లో ఉన్న రాష్ట్రాల గురించి ఎందుకు ప్రస్తావించారు. రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ , ప్రత్యేక హోదా, మీరు ఇచ్చిన విభజన హామీలపై ఎందుకు మట్లడారు. మా ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ చూడలేక ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం చేయడం సరికాదు. పార్టీలో ఏదైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం అయినా నిర్వహించడం జరుగుతుంది. మళ్లీ జిల్లాలో జిల్లా పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో నాలుగు స్థానాల్లో వైసిపి విజయం సాధించడం ఖాయమని అన్నారు.

Related Posts