YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం

హైదరాబాద్‌ ఆగష్టు 1
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 15 బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాబశివరావు ఇంటితోపాటు పలువురి ఇండ్లలో సోదాలు చేస్తున్నారు.మాలినేని సాంబశివరావు ట్రాన్స్‌ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు సాంబశివరావు డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే బ్యాంక్‌ల నుంచి తీసకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొటినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై ఈడీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

Related Posts