YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అటు కరువు...ఇటు యాత్రలు

అటు కరువు...ఇటు  యాత్రలు

కర్నూలు, ఆగస్టు 2,
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు చేపట్టిన ప్రాజెక్ట్ ల యాత్రకు కౌంటర్ ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను పార్టీ నాయకత్వం ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది.రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితులపై ప్రతిపక్ష నేత హోదాలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు టూర్ ప్లాన్ చేశారు. దాదాపుగా వారం రోజులు పాటు ఆయా ప్రాజెక్ట్ లను సందర్శించేందుకు గాను ఇప్పటికే కర్నూలు జిల్లాకు చంద్రబాబు చేరుకున్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ ల తీరు పై చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జగన్ సర్కార్ తీరు పై విమర్శలు గుప్పించారు. కనీసం ప్రాజెక్ట్ లకు గ్రీజు కూడపెట్టం లేదని ఎద్దేవా చేశారు. వరుసగా ప్రాజెక్ట్ లను సందర్శించి అక్కడ పరిస్థితులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగతామని చంద్రబాబు సర్కార్ అల్టిమేటం జారీ చేశారు.చంద్రబాబు రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్ట్ లపై ప్రభుత్వ తీరు పై విమర్శలు వ్యక్తం చేస్తూ సీఎం జగన్ అసమర్దత అంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు కూడా పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ప్రాజెక్ట్ ల అవినీతి పై కూడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి వాస్తవాలను కూడ వెల్లడించాలని పార్టి శ్రేణులు భావిస్తున్నారు. ఒక్కొ ప్రాజెక్ట్ వద్దకు వైసీపీ నాయకులు వెళ్ళి అక్కడ పరిస్దితులను ప్రజలకు అర్దం అయ్యే విధంగా కార్యచరణ చేపడుతున్నారు. అంతే కాదు ప్రాజెక్ట్ వద్ద వాస్తవ పరిస్దితులు, సాగునీరు, ఆయకట్టు త్రాగునీటి అంశాల ను కూడ కూలంకుషంగా ప్రజలకు వివరించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న చర్యలను తిప్పికొడతాం అంటున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులకు వైసీపీ కేంద్ర  కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.చంద్రబాబు పాలన అంటేనే కరువు అనే విషయం పై భారీగా ప్రచారం చేయాలని వైసీపీ నిర్ణయించింది. చంద్రబాబు పాలనలో వానలు లేక, ప్రాజెక్ట్ అన్ని ఎండిపోయిన దుస్థితిపై ఫోటో ప్రదర్శనలు ఇవ్వాలని, ఇప్పుడు వైఎస్ జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్ట్ లన్నీ నిండు కుండలా మారిన విషయాలపై  ప్రచారం చేయాలని పార్టి నాయకులు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసా ద్వార రైతులను ఆదుకుంటున్న తీరు రైతుల్లో వ్యక్తం అవుతున్న సంతోషం, వాస్తవ అంశాలను  వివరించేందుకు అవసరం అయిన రూట్ మ్యాప్ ను వైసీపీ రెడీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో గ్రామాల్లో నెలకొన్న కరువు పరిస్దితులు ఇక్కడ కీలకంగా ప్రస్తావించాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం అవసరం అయితే సోషల్ మీడియా లో భారీగా ప్రచారాలు చేసుకోవటం పై కూడ పార్టి శ్రేణులకు నాయకులు కార్యచరణను విడుదల చేశారు.

Related Posts