YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పడవ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి

పడవ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి

రాష్ట్ర రాజధాని ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పడవ ప్రమాదం చోటుచేసుకుంది. చేనల వేటకు వచ్చిన బోటు, ఇసుక తరలించే బోటు ఢీకొన్న సంఘటనలో తల్లీ కూతురు మృతి చెందింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ఓ కుటుంబం బోటు ద్వారా కృష్ణా నదిలో చేపల వేటకు వచ్చింది. బోరుపాలెం వద్ద ఇసుకను తరలించే బోటును చేపల వేటకు వచ్చిన బోటు ఢీకొనడంతో బోటులో ఉన్న తల్లీ మాధవి, కూతురు శ్రావ్య నదిలో పడి మృతిచెందారు. భర్త ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. నదిలో గల్లంతైన తల్లీ, కూతురు మృతదేహాల కోసం గాలించి బయటకు తీసారు.  

Related Posts