చింతపల్లి
వారంతా చెడు వ్యవసనాలకు అలవాటు పడ్డారు.ఆ దాయం కోసం అడ్డ దారులు వెతకడం మొదలుపె ట్టారు.ఈజీ మనీ కోసం గంజాయి అమ్మాలని భావిం చారు.గంజాయి తరలించేందు కు ప్లాన్ చేశారు.ఈ క్రమంలో పోలీసు లకు పట్టుబడ్డారు. చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడి శా రాష్ట్రం నుంచి మహా రాష్ట్ర తరలిస్తున్న 350 కేజీల గంజా యిని పోలీసులు పట్టుకున్నారు.గంజాయి నివా రణలో భాగంగా చింతపల్లి సబ్ డివిజన్ అధికారి ప్రతా ప్ శివకిషోర్ ఆధ్వర్యంలో, జీకే వీధి సీఐ అశోక్ కుమా ర్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ వాహనాల తనిఖీలు చేప ట్టారు. ఈ క్రమంలో TRC క్యాంప్ జంక్షన్ 353 కేజీల గంజాయితో వెళ్తు న్న ఐదుగురు ముఠాను పోలీసులు పట్టుకున్నారు.నిందితుల అరెస్ట్ చూ పించారు. టయో టా కారులో 12 గోనె సంచుల గంజాయిని ఎక్కించి వెళ్లి భద్రాచలంలో సికిందర్కు అప్పగిం చేందుకు బయల్దేరా రు. ఈ క్రమంలో TRC క్యాంపు దగ్గర పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని 353 కేజీల 12 గంజాయి మూటలు, టయోటా కారు, 3 మొబైల్ ఫోన్లు, 3000 నగదు సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చింతపల్లి కోర్టుకు తరలిం చారు.