హైదరాబాద్
సీఎం క్యాంపు కార్యాలయంలో ఓఎస్డీగా పని చేస్తున్నఅధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. హెల్ప్ కోసం గూగుల్ ని సర్చ్ చేసే సమయంలో అపరిచిత వ్యక్తులు పంపిన లింక్ ని ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే నొక్కేశారు. లింక్ ను నొక్కే సమయంలో 7 లక్షల రూపాయలు పోగొట్టున్నారు. దాంతో అయన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.