హైదరాబాద్
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ బి ఫామ్ లు ఇస్తున్నారు. ఈ విషయం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడం లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఇది సరైన చర్యనే అని ఎన్నికల కమిషన్ భావిస్తే అదే విషయం చెప్పాలి. మేము ఫిర్యాదులు చేయడం మనేస్తాం.. మా టైం మీ టైం వెస్ట్ కాదు.
తెలంగాణ లో బీజేపీ కీలక నేత ఇంద్రసేనరెడ్డి కి గవర్నర్ పదవి ఇచ్చారు. ఆయన బీజేపీ లో పని చేయడం వల్లనే పదవి వచ్చిందని ప్రకటన చేశారు. ఇది ఓటర్లను ప్రభావితం చేస్తాది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అయన అన్నారు.