YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ నవంబర్ కి వాయిదా వేసిన ధర్మాసనం

సుప్రీం కోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ నవంబర్  కి వాయిదా వేసిన ధర్మాసనం

న్యూఢిల్లీ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ నవంబర్ 8 వ తేదీకి  వాయిదా పడింది.  చంద్రబాబు తరఫున లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనాలు వినిపించారు.. సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా ఒక దానిపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసిందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో విచారణను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రభుత్వ లాయర్ స్పందిస్తూ.. కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి అరెస్టు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పారు. ఆ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
పైబర్ నెట్ కేసులో మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. చంద్రబాబు పిటిషన్ ను మాత్రం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.  దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారణకు వచ్చింది. . జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.

Related Posts